- హుజూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సైతం కరెంట్ కట్
సూర్యాపేట: జిల్లా కేంద్రమైన సూర్యాపేట తాహశీల్దార్ ఆఫీసుకు శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అలాగే హుజూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సైతం కరెంట్ కట్ చేశారు. సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేసినట్లు సమాచారం. వీకెంట్ కావడంతో ధరణి, ఇతర సేవల కోసం తాహశీల్దార్ ఆఫీసుకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. కరెంట్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో కార్యాలయానికి వచ్చి ప్రజలుతదితరులు ఇబ్బందిపడ్డారు. చేసేదేమీ లేదంటూ చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు.
హుజూర్ నగర్ రిజిస్ట్రేష్ కార్యాలయానికి సైతం కరెంటు సరఫరా నిలిపివేయడంతో రిజిస్ట్రేషన్లు తదితర సేవలు, లావాదేవీలు నిలిచిపోయాయి. కరెంటు సరఫరా లేనందున ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని.. సహకరించగలరు అంటూ కాగితం మీద రాసి.. కార్యాలయం నోటీసు బోర్డులో అంటించడంతో ఆఫీసుకు వచ్చిన వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు.